డ్రగ్స్ కేసు పై స్పందించిన సురేఖ వాణి

తెలుగు చిత్ర పరిశ్రమను డ్రగ్స్ వివాదం నిద్ర లేకుండా చేస్తుంది.

తరచూ డ్రగ్స్ వ్యవహారాల కారణంగా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ వివాదంలో చిక్కుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు దొరికిన విషయం మనకు తెలిసిందే .

తాను 12 మందికి డ్రగ్స్ అమ్మానని అందులో సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉన్నారంటూ ఈయన ఒప్పుకున్నారు.

అయితే ఈయన ఫోన్ చేసినటువంటి వారిలో నటి జ్యోతి, సురేఖ వాణి , అశు రెడ్డి వంటి వారి పేర్లు కూడా తెర పైకి వచ్చాయి.

ఇలా వీరి పేర్లు తెరపైకి రావడంతో సురేఖ వాణి స్పందించారు.

కొద్దిరోజులుగా తమపై వస్తున్నటువంటి అలిగేషన్స్ కి మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.

ఇలా ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా మాపై నిందలు వేయడం సరైనది కాదు అని అన్నారు

ఇలాంటి వార్తల వల్ల తమ ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని తమ కెరియర్ కూడా నాశనం అవుతుంది దయచేసి మమ్మల్ని వదిలేయండి అంటూ స్పందించారు.