22 September 2024

మహేష్ మేనల్లుడి సరసన గౌరీప్రియ.. ఈ హీరోయిన్ గురించి తెలుసా..? 

Rajitha Chanti

Pic credit - Instagram

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఉద్భవ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇందులో గౌరీప్రియ హీరోయిన్‏గా నటిస్తుంది.

2021లో మెయిల్ సినిమా ద్వారా తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది గౌరీప్రియ. ఇందులో మంచి నటనతో ప్రశంసలు అందుకుంది. 

ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్ సినిమాలో కనిపించింది. చిన్న చిన్న సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది ఈ అమ్మడు. 

ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్ సినిమాలో కనిపించింది. చిన్న చిన్న సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది ఈ అమ్మడు. 

 ఇటీవలే లవర్ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులోనూ గౌరీకి మంచి క్రేజ్ వచ్చింది. 

ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటున్న గౌరీ ప్రియ.. ఇప్పుడు అశోక్ గల్లా కొత్త ప్రాజెక్టులో కథానాయికగా ఎంపికైంది. 

తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మ్యాడ్ చిత్రంలోనూ అలరించింది. ఇందులో శ్రుతి పాత్రలో కనిపించి అందం, అభినయంతో కట్టిపడేసింది.

2018లో మిస్ హైదరాబాద్‏గా ఎంపికైంది. అంతేకాదు ఆమె మంచి గాయని. బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ పూర్తి చేసి ఓ ఛానల్లో యాంకరింగ్ చేసింది.