01 October 2024

నా పిల్లలకు వీళ్ల గురించి కచ్చితంగా చెబుతాను.. హీరోయిన్ శోభితా.. 

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన లవ్ సితార మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా శోభితా చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. 

డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ -1 మూవీ విడుదలై రెండేళ్లు పూర్తైన సందర్భంగా శోభితా పోస్ట్ చేసింది. 

ఈ మూవీ టీంతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. అందుకు శోభితా ధూళిపాళ్ల పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 

విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్ బచ్చన్, శోభితా ధూళిపాళ్ల ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

వీరందరూ కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ 'వీళ్లందరూ ఎవెంజర్స్ అని నా పిల్లలకు చెబుతాను' అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. 

ప్రస్తుతం శోభితా చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. ఆ టీంకు నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. 

కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది.