పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా మారిన రుక్మిణి..

23 September 2025

Rajeev 

 కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా సప్త సాగరాలు దాటి సినిమా. ఈ సినిమాలో కథానాయికగా అందరి దృష్టిని ఆకర్షించింది రుక్మిణి వసంత్. 

బీర్బల్ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఈ వయ్యారి హిందీలో అప్ స్టైర్స్ అనే సినిమాలో నటించింది.

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ వయ్యారికి ఇప్పుడు సోషల్ మీడియా భారీ ఫాలోయింగ్ వచ్చేసింది.

సప్త సాగరాలు దాటి సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది ఈ హీరోయిన్. ఈ సినిమా ఆమెకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 

దీంతో తెలుగుతోపాటు కన్నడలోనూ ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కన్నడలో శ్రీమురళీకి జోడిగా భఘీర చిత్రంలో నటించింది. 

ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది.. అలాగే నిఖిల్ సరసన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంలో నటించింది.

ప్రస్తుతం కన్నడ, తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకుంది. ఇటీవలే తమిళంలో విజయ్ సేతుపతి జోడిగా ఏస్ అనే సినిమాలో నటించింది. 

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాతో పాటు కాంతార ప్రీక్వెల్ లోనూ నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.