26 October 2024

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో ఛాన్స్.. హీరోయిన్ రియాక్షన్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు చేరువయ్యింది హీరోయిన్ రుక్మిణి వసంత్. 

ఈ సినిమాతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు నిఖిల్ సరసన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీతో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది.

మరోవైపు తమిళంలో శివ కార్తికేయన్ జోడిగా ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఓ ప్రాజెక్టులోనూ ఈ బ్యూటీని ఎంపిక చేశారు. 

అలాగే కన్నడలో స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్న భారతి రంగల్ అనే చిత్రంలో నటిస్తూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. 

ఇక ఇప్పుడు ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులోనూ ఈ అమ్మడుకు ఛాన్స్ వచ్చిందని టాక్ వినిపిస్తుంది. 

ప్రస్తుతం కన్నడలో శ్రీమురళి సరసన బఘీరా మూవీలో నటించిన రుక్మిణి కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది. 

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రుక్మిణి.. ఎన్టీఆర్ మూవీ గురించి మాట్లాడుతూ తనను సంప్రదించలేదని తెలిపింది. 

ఆ మూవీ కోసం తనను ఎవరూ సంప్రదించలేదని.. ఒకవేళ ఛాన్స్ వస్తే వెంటనే సైన్ చేస్తానని.. అదొక అందమైన రూమర్ అని తెలిపింది.