వరుస ఫ్లాప్స్ .. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వయ్యారి భామ రీతూ

11 December 2025

Pic credit - Instagram

Rajeev 

తెలుగమ్మాయి రీతూ వర్మ గుర్తుందా. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్‌గా మారిన సినిమాలు చేస్తోంది

 తెలుగుతో పాటు తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. 

కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఈ భామ. ఆతర్వాత సినిమాల్లోకి వచ్చింది.

ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ చెల్లి పాత్రలో మెరిసింది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది.

2013లో ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఆకట్టుకుంది.

ఇక 2016లో వచ్చిన పెళ్ళిచూపులు సినిమా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ భామ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల ఎంచుకుంటూ రాణిస్తుంది.

ఈ అమ్మడు చివరిగా చేసిన స్వాగ్, మజాకా సినిమాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది ఈ వయ్యారి భామ.