ఇక భరించలేను.. సోషల్ మీడియా‌కు దూరంగా రేణు దేశాయ్

Rajeev 

26 June 2024

ఈ మధ్య కాలంలో రేణు దేశాయ్ .. సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన ఎక్కువగా పడుతున్నారు. 

రేణు దేశాయ్, నెటిజన్ల మధ్య గత కొన్ని రోజులుగా ఒక మినీ యుద్ధమే జరుగుతోంది.

రేణు దేశాయ్, ఆమె పిల్లలలను టార్గెట్ చేస్తూ కొంతమంది నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్ చేస్తున్నారు. 

అయితే తనను తన పిల్లలను ట్రోల్ చేసే వారికి ధీటుగా సమాధానం చెప్తూ వస్తున్నారు రేణు దేశాయ్. 

అయితే ఎన్నికల తర్వాత ట్రోలర్స్ మరింత రెచ్చిపోయారు. దాంతో రేణు దేశాయ్ సహనం కోల్పోయారు. 

కొంతమంది నీఛమైన కామెంట్లు పెడుతూ.. రేణు దేశాయ్ ను మానసిక క్షోభకు గురించేస్తున్నారు. 

తన ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలను క్లోజ్ చేస్తానని భావోద్వేగ మెసేజ్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు రేణూ దేశాయ్.