TV9 Telugu

06 February 2024

ఆ నిర్మాత నన్ను దారుణంగా మోసం చేశారు.. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా.

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఎన్నో కష్టాలు ఎదుర్కొని సినిమాల్లో రాణిస్తూ ఉంటారు.

తాజాగా ఓ హీరోయిన్ తనకు రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారని తెలిపింది. అంతే కాదు ఫోన్ చేసిన కూడా స్పందించలేదు.

దాంతో తాను మోసపోయాయని తెలుసుకున్నా అని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ అమ్మడు మరెవరో కాడి మాల్వీ మల్హోత్రా.

బుల్లితెర నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తుంది మాల్వీ మల్హోత్రా.

తాజాగా ఓ నిర్మాత తనను మోసం చేశాడని తెలిపింది ఈ బ్యూటీ. తాను మాల్వి బర్బాద్ కర్ దియా తేరే ప్యార్ నే అనే మ్యూజిక్ వీడియోలో నటించాను..

ఈ వీడియోకు బాలీవుడ్ స్టార్ విక్రమ్ భట్ కూతురు కృష్ణ భట్ దర్శకత్వం వహించింది.

అయితే విక్రమ్ ఈ వీడియో చేసుకందుకు తనకు ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వలేదు అని తెలిపింది మాల్వీ మల్హోత్రా.

ఎన్ని సార్లు ఫోన్ చేసినా కూడా కనీసం స్పందించలేదు అని తెలిపింది మాల్వీ మల్హోత్రా.