07 October 2024

నా గుండె ముక్కలైంది.. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ఎమోషనల్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. తాజాగా తన ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. 

తన పెంపుడు శునకం చనిపోవడంతో ఆ బాధ నుంచి బయటపడలేకపోతుంది. తన పెట్ డాగ్ ఫోటోస్ షేర్ చేసింది కళ్యాణి. 

పెట్ డాగ్‏తో ఆడుకున్న క్షణాలను గుర్తు చేసుకుంటూ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతూ సుధీర్ఘ పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. 

థియో.. ఈ వారమే నన్ను వదిలేసి వెళ్లిపోయింది. తన మరణవార్త నా గుండెను ముక్కలు చేసింది అంటూ ఎమోషనల్ అయ్యింది. 

చూసేందుకు చిన్నగా ఉన్నప్పటికీ దానికి ఎంతో ఎనర్జీ ఉండేది. మేము దానిని ఇంటి యజమాని అని పిలిచేవాళ్లం. ఎందుకంటే ఇది తనిల్లు..

తన ఇంట్లోనే మేము నివసిస్తున్నాం. అదొక వాచ్ డాగ్ కూడా. స్టూడియో బయట కూర్చొవడం దానికి చాలా ఇష్టం. ప్రతి వేసవిలో దానికి 

హెయిర్ కట్ చేసేవాళ్లం. చివరిసారిగా దానితో ఉన్నప్పుడు గట్టిగా పట్టుకుని ప్రేమలో ముద్దు పెట్టుకోవాల్సింది. ప్రేమ కురిపించినవారికి కృతజ్ఞతలు. 

అది లేదన్న నిజం తట్టుకోలేకపోతున్నాను. గత కొన్నేళ్లుగా నీతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. నిన్ను చాలా ప్రేమించాను పోస్ట్ చేసింది.