09 May 2024

హీరోయిన్ చనిపోయినట్లు వార్తలు.. అసలు విషయం ఇదే

Rajitha Chanti

Pic credit - Instagram

శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది హీరోయిన్ భావన. ఆ తర్వాత అనుకోకుండా సినిమాలకు దూరమైంది. 

మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే భావన కిడ్నాప్ కు గురైంది. ఓ హీరో ఆమెను బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. 

చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న భావన ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను పంచుకుంది. 

2018లో నిర్మాత నవీన్ ను వివాహం చేసుకుంది. కానీ గతంలో ఆమె అనూప్ మీనన్ ను పెళ్లి చేసుకున్నట్లు తప్పుడు వార్తలు సృష్టించారని తెలిపింది. 

అలాగే తనకు అనేకసార్లు అబార్షన్స్ అయ్యాయని రూమర్స్ క్రియేట్ చేశారని.. గతంలో ఏకంగా తాను చనిపోయినట్లు వార్తలు కూడా ప్రచారం చేశారని తెలిపింది. 

ఎన్నో విధాలుగా తన జీవితం గురించి అసత్యాలను సృష్టించారని అమెరికా, చెన్నై, కొచ్చి ఇలా పలు ప్రాంతాల్లో అబార్షన్స్ అయ్యాయని రూమర్స్ రాశారని తెలిపింది. 

తన జీవితం గురించి వస్తున్న వార్తలు విని మానసికంగా ఎంతో బాధపడినట్లు చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు చాలా బలంగా ఉంటున్నానని తెలిపింది. 

కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న భావన ఇప్పుడు మలయాళంలో నడికార్ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. నెట్టింట భావన చాలా యాక్టివ్.