11 July 2024
అలాంటి పాత్రలకు సై అంటోన్న అంజలి.. ఇక రోటిన్ రోల్స్కు గుడ్ బై...
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ అంజలి. కానీ ఇప్పుడు రూటు మార్చినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం అంజలి రోటీన్ పాత్రలకు నో చెబుతున్నట్లుగా కనిపిస్తుంది. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుంది.
ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ కథలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తుంది అంజలి. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ.
అంతకు ముందు గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రంతో ప్రేక్షకులకు భయపెట్టిన అంజలి.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో వేశ్వ పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
విలేజ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన సినిమాలో అంజలి అద్భుతంగా నటించిందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ట్రైలర్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.
ఈ మూవీలో మరోసారి వేశ్య పాత్రలో అంజలి తనదైన నటనతో అదరగొట్టేసినట్లుగా తెలుస్తోంది. ఆహార్యం, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసేలా ఉంది.
ఇకపై రెగ్యులర్ హీరోయిన్ పాత్రకు అంజలి నో చెప్పినట్లుగా కనిపిస్తుంది. ఇకపై తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి.