06 June 2024

మిస్ యూ అంటోన్న హీరో సిద్ధార్థ్.. అసలేం జరిగిందంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

ఎవర్‏గ్రీన్ లవర్ బాయ్ సిద్ధార్థ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ అదితి రావ్ హైదరీతో ఇప్పటికే నిశ్చితార్థం జరిగింది. 

మహా సముద్రం సినిమాలో కలిసి నటించిన వీరిద్దరు ఆ తర్వాత తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. ఇటీవలే తమ లవ్ స్టోరీ కూడా చెప్పుకొచ్చాడు.

మరోవైపు తిరిగి తన కెరీర్‏లో కూడా జోరు పెంచాడు సిద్ధార్థ్. గతేడాది చిన్నా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సిద్దూ కొత్త సినిమా ప్రకటించాడు. 

ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 చిత్రంలో కీలకపాత్ర పోషించాడు సిద్ధార్థ్. తాజాగా తన లేటేస్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ కూడా షేర్ చేశాడు. 

మిస్ యూ అనే టైటిల్‌తో కొత్త సినిమాను చేస్తున్నాడు సిద్ధార్థ్. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మాధవన్, శివకార్తికేయన్, డైరెక్ట్ లోకేష్ లాంచ్ చేశారు. 

మరోసారి రొమాంటిక్ డ్రామాతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు సిద్ధార్థ్. తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. 

కళతిల్ సంతిపోమ్ ఫేమ్ రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో నా సామిరంగ ఫేమ్ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుంది. 

7 మైల్స్ పెర్ సెకండ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. చాలా కాలం తర్వాత రొమాంటిక్ లవ్ స్టోరీతో రాబోతున్నాడు.