కోహ్లీ నుంచి పంత్ వరకు.. భారత క్రికెటర్ల విద్యార్హతలు ఇవే..

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 12వ తరగతి వరకు చదువుకున్నాడు.

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం 9వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు.

భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్ బౌలర్ యుజేంద్ర చాహల్ హర్యానాలోని మహాత్మా గాంధీ కాలేజ్ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి గ్రాడ్యుయేట్.

టీమిండియా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ పాట్నా కాలేజ్ ఆఫ్ కామర్స్‌ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు.

టీమిండియా కీపర్ రిషబ్ పంత్ ఢిల్లీ యూనివర్సిటీలోని శ్రీ వెంకటేశ్వర కాలేజీలో బి.కామ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు.