మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్.

ఇప్పుడు సీతారామం (Sita Ramam) సినిమాతో మరోసారి టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.

డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచగా..

మరోవైపు సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.