మలయాళం బ్లాక్ బూస్టర్ చిత్రం ‘దృశ్యం’

రీమేక్‌ అయినా అన్ని భాషల్లోనూ మంచి స్పందన లభించింది.

ఈ చిత్రంలో మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా నటించారు.

తెలుగు రీమేక్‌లో వెంకటేష్ కధానాయకుడు.

ఈ చిత్రం విజయంతో ‘దృశ్యం-2’ ని తెరకెక్కించారు.

ఈ చిత్రం కూడా అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది.

కరోనా సమయంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయినా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇదిలాఉంటె ఇప్పుడు  ‘దృశ్యం-3’ చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం.

మలయాళం, హిందీలో కూడా ఒకేసారి షూటింగ్ చేసి ఒకే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని సమాచారం.

కాగా వచ్చే ఏడాది ఈ చిత్రం చిత్రీకరణ ప్రారంభయ్యే అవకాశం ఉంది.