నిత్యనంద స్వామి కైలాస అనే పేరుతో ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే.

దీనికి పౌరసత్వం కూడా జారీ చేస్తున్నారు.

తాజాగా, ఈ దేశం నుంచి ఐక్యరాజ్యసమితికి ఓ ప్రతినిధి హాజరయ్యారు.

ఆమె పేరు విజయప్రియ, ఇంతకీ ఈమె ఎవరనే ప్రశ్న మొదలైంది

 ఐక్యరాజ్యసమితిలో విజయప్రియ నిత్యానంద కైలాస దేశం శాశ్వత రాయబారి

ఆమె తనను తాను అమెరికాలోని వాషింగ్టన్ డిసి నగర నివాసిగా పేర్కొన్నారు.

లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. విజయప్రియ మనిటోబా యూనివర్సిటీలో మైక్రోబయోలాజీ బీఎస్సీ హానర్ చేశారు.

 ఆమెకు ఇంగ్లీష్, ఫ్రెంఛ్, హిందీ, క్రోలీ, పిడ్జింగ్(ఫ్రెంచ్ సంబంధిత) భాషలు తెలుసు.