బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకెళుతోంది.
ఈ మూవీలో శృతిహాసన్ మెయిన్ హీరోయిన్ గా నటించగా హనీ రోజ్ సెకండ్ హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాలో బాలయ్య చెల్లెలు భానుమతి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించింది
హీరోను ఢీకొట్టే బలమైన విలన్ పాత్రలో వరలక్ష్మీ అభినయం అందరినీ ఆకట్టుకుంది
మూవీలో బాలయ్య పాత్రకు ఎంత గుర్తింపు వచ్చిందో వరలక్ష్మీ క్యారెక్టర్ కూడా అంతే హైలెట్గా నిలిచింది
కాగా భానుమతి పాత్రకు ముందు స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ను తీసుకోవాలనుకున్నారట
అయితే క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉండడంతో ఈ అవకాశాన్ని వదులుకుందట కీర్తి.