మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే.

ఘనంగా మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.

వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తల గురించి మెగా ఫ్యామిలీ ఏ విధంగాను స్పందించకపోవడంతో అందరిలోనూ సందేహం ఉంది.

అయితే వరుణ్ తేజ్ టీమ్ ఈ విషయం గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఇద్దరు జూన్ తొమ్మిదో తేదీ నిశ్చితార్థం జరుపుకోబోతున్నారంటూ క్లారిటీ ఇచ్చారు.

ముఖ్యంగా వీరిద్దరి వెడ్డింగ్ కార్డ్స్ కోసమే భారీగా ఖర్చు చేయబోతున్నట్టు సమాచారం.

ఒక్కో వెడ్డింగ్ కార్డు కోసం దాదాపు 80 వేల వరకు ఖర్చు చేస్తున్నారట.బంగారు పూతతో ఈ వెడ్డింగ్ ని కోటింగ్ చెయ్యబడుతుందని తెలుస్తుంది.

ఇలా ఒక్క వెడ్డింగ్ కార్డు కోసమే 80 వేల వరకు ఖర్చు చేస్తున్నారు అంటే ఇక ఈ పెళ్లి ఏ రేంజ్ లో జరగబోతుందో అర్థం చేసుకోవచ్చు.

 ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్యల వివాహం కూడా జైపూర్ ఉదయ్ గడ్ ప్యాలెస్ లోనే జరగబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి