మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ‘విరూపాక్ష’.

ఈ సినిమాలో హీరోయిన్ తల్లి గా టించిన అమ్మాయి ఎవరో తెలుసా ??

ప్రియురాలు అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కామాక్షి భాస్కర్ల ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. 

ఇప్పుడు విరూపాక్ష మూవీ తో గుర్తింపు తెచ్చుకుంది.  కామాక్షి వృత్తిరీత్యా డాక్టర్. 

ఎంబీబీఎస్ చదువుతున్న సమయం లో సాయి కామాక్షి 2018వ సంవత్సరంగానూ ఫెమినా మిస్ తెలంగాణ కిరీటం అందుకుంది. 

ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. మిస్ ఇండియా 2018 పోటీల్లోనూ పాల్గొని ఫైనల్స్ వరకు చేరింది. 

చైనాలో మెడిసిన్ చేసిన కామాక్షి.. అపోలో హాస్పిటల్ లో కూడా కొన్నాళ్లపాటు పనిచేసింది.

ఆ తర్వాత సినీ రంగం పై మక్కువతో మోడల్ గా చేస్తూనే.. పలు సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో మాత్రం అక్కినేని అఖిల్ అమెరికా ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒక అమ్మాయి గా కామాక్షి కనిపించింది.

ఆ తరువాత రౌడీ బాయ్స్, మా ఊరి పొలిమేర, విరూపాక్ష చిత్రాల్లో నటించింది. ఇవే కాకుండా పలు వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది కామాక్షి.