బిర్యానీ విషయంలో యశస్వి, సిరాజ్ గొడవ.! అసలేం జరిగిందంటే?

TV9 Telugu

2 September 2024

ఇద్దరు భారత క్రికెటర్లు బిర్యానీ కోసం గొడవ పడ్డారు. అయితే, ఇది ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు.

బిర్యానీ కోసం గొడవ

నిజానికి, యశస్వి సిరాజ్ కోసం ఒక ప్లేట్ బిర్యానీ పంపాడు. అయితే సిరాజ్ చెప్పిన ప్రకారం అది నిజమైన బిర్యానీ కాదు. 

అసలు బిర్యానీ కాదు

సిరాజ్ మొదటగా బిర్యానీకి యశస్వికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ తర్వాత ఇన్‌స్టా స్టోరీలో నెక్ట్స్ టైమ్ నిజమైన బిర్యానీ పంపు అంటూ రాసుకొచ్చాడు. 

హైదరాబాదీ బిర్యానీ

బిర్యానీ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినా ఫలితం లేకపోయింది. కేవలం కామెంట్లతోనే ఇద్దరూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు.

బిర్యానీ చర్చలో ఫలితం లేదు

ప్రస్తుతం సిరాజ్, యశస్వి ఇద్దరూ క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. ఎందుకంటే టీమిండియా ప్రస్తుతం విరామంలో ఉంది. 

క్రికెట్‌కు దూరంగా

బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆడే అవకాశాలున్నాయి. త్వరలో భారత జట్టును ప్రకటించనున్నారు. 

బంగ్లా సిరీస్ నుంచి రీఎంట్రీ

సెప్టెంబర్ నెల నుంచి భారత్ వర్సెస్ బంగ్లా జట్ల మధ్య రెండు టెస్టు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం. 

భారత జట్టుకు కీలకం

ఈ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా విజయం సాధిస్తే.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచేందుకు ఆస్కారం ఉంటుంది.

డబ్ల్యూటీసీలో టాప్ ప్లేస్