09 Sep 2023
Pic credit - Instagram
విరాట్ కోహ్లి తన వద్ద టీమ్ ఇండియాకు చెందిన ఒకే ఒక్క జెర్సీ ఉందని ఓ సందర్భంలో వెల్లడించాడు. అది తనకు ఎంతో స్పెషల్ అని తెలిపాడు.
ఇది విరాట్ కోహ్లీ హృదయానికి చాలా దగ్గరైన టెస్ట్ జెర్సీ. దీనికి గల కారణాన్ని కూడా విరాట్ వెల్లడించాడు.
తన తొలి టెస్టు సెంచరీ సందర్భంగా తాను ధరించిన జెర్సీని స్పెషల్గా రూపొందించినట్లు విరాట్ తెలిపాడు. అందులో సచిన్ సంతకం కూడా ఉంటుందని తెలిపాడు.
క్రికెట్ గాడ్ సంతకంతో ఉన్న ఆ స్పెషల్ జెర్సీని తన ఇంటిలో ఉంచుకున్నట్లు టీమిండియా రన్ మెషీన్ తెలిపాడు. ఇది ఎంతో ప్రత్యేకమైనదంటూ తెలిపాడు.
2012లో అడిలైడ్లో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ తన తొలి టెస్టు సెంచరీని సాధించాడు. 116 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
టెస్ట్ ఫార్మాట్ తన హృదయానికి అత్యంత సన్నిహితమైనదని విరాట్ కోహ్లీ చాలాసార్లు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాని సంగతి తెలిసిందే.
విరాట్ కోహ్లీ టెస్టుల్లో 29 సెంచరీలు చేశాడు. అలాగే వన్డేల్లో 46 సెంచరీలు సాధించాడు. టీ20లోనూ సెంచరీ సాధించాడు.
తాజాగా పాకిస్తాన్పై కళ్లు చెదిరే ఇన్నింగ్స్తో సెంచరీ చేసి, ఆకట్టుకున్నాడు. 94 బంతుల్లో 122 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.