పొట్టి ఫార్మాల్‌లో తొలి భారత ఆటగాడిగా కింగ్ కోహ్లీ రికార్డ్.. అదేంటంటే?

14th January 2024

Pic credit - Freepik

ఇండోర్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో టీ20 జరగనుంది. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌తో పొట్టి ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.

విరాట్ కోహ్లి సుమారు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత టీ20 ఫార్మాట్‌లో పునరాగమనం చేస్తున్నాడు. అతను చివరిసారిగా 2022 టీ20 ప్రపంచకప్‌లో టీ20 మ్యాచ్ ఆడాడు.

విరాట్ కోహ్లీ పునరాగమనం ప్రత్యేకం. ఎందుకంటే ఇప్పుడు అతను T20 ప్రపంచ కప్ 2024 కోసం సిద్ధమవుతున్నాడు. తాను కూడా పొట్టి ప్రపంచకప్‌నకు సిద్ధం అంటున్నాడు.

ఇప్పటికే విరాట్ కోహ్లీ భారత జట్టుతో కలిసి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇండోర్ వేదికగా నేడు ఆప్ఘానిస్తాన్‌తో టీమిండియా నేడు రెండో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో తలపడనుంది. సాయత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.

విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌లోకి వచ్చిన వెంటనే పెద్ద రికార్డు సృష్టించగలడు. టీ-20 క్రికెట్‌లో 12 వేల పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలుస్తాడు.

ఈ ఘనత సాధించడానికి, విరాట్ 35 పరుగులు చేయాల్సి ఉంది. ఇందులో విరాట్ కోహ్లీ తన పేరిట దాదాపు 4 వేల అంతర్జాతీయ పరుగులు, మిగిలిన పరుగులు అతని T-20 లీగ్‌లో వచ్చాయి.

T-20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. అయితే T-20 క్రికెట్‌లో అత్యధిక పరుగుల గురించి మాట్లాడితే 14562 పరుగులు చేసిన క్రిస్ గేల్ పేరు మీద ఉంది.