TV9 Telugu

ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్‌లకు దూరమైన ఆటగాళ్లు..

6th March 2024

ఐపీఎల్ 2024 సీజన్ సిద్ధమైంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. అయితే, కొంతమంది ఆటగాళ్లు తొలి మ్యాచులకు దూరం కానున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..

మహ్మద్ షమీ: గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న భారత పేసర్ గాయ కారణంగా ఇప్పటికే సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

సూర్య కుమార్ యాదవ్: సౌతాఫ్రికా సిరీస్ తర్వాత భారత్ తరపున ఆడలేదు. కొత్త సీజన్‌లో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌ల్లో కనిపించపోవచ్చని అంటున్నారు.

రషీద్ ఖాన్: గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ టీమిండియాతో తలపడిన సిరీస్‌లో ఆఫ్ఘానిస్తాన్ జట్టులో లేదు. చివరిసారిగా 2023లో వన్డే ప్రపంచకప్ ఆడాడు.

రిషబ్ పంత్: ఈ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గాయం నుంచి కోలుకున్నాడు. కానీ, తొలి మ్యాచ్‌ల్లో అందుబాటులో ఉండకపోవచ్చిన అంటున్నారు.

డేవాన్ కాన్వే: గత ఏడాది బ్యాటింగ్ ఆర్డర్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును అగ్రస్థానంలో నడిపించిన ఈ న్యూజిలాండ్ ప్లేయర్.. కొత్త సీజన్‌లో కనీసం ఫస్ట్ హాఫ్‌ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

కేఎల్ రాహుల్: ఇంగ్లండ్ జట్టుతో చివరి నాలుగు టెస్టులకు దూరమైన ఈ టీమిండియా కీపర్.. 2024 సీజన్‌లోని తొలి మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

రీస్ టాప్లీ: గాయం కారణంగా ఈ ఇంగ్లండ్ స్టార్ పీఎస్‌ఎల్ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ 2024 ఆరంభానికి కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడా లేదా అనేది చూడాలి.