సెమీ ఫైనల్ చేరే ఆ 4 జట్లు ఇవే.. తేల్చేసిన సెహ్వాగ్..

ICC 2023 ODI ప్రపంచ కప్ షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ మహాకుంభ్ క్రికెట్‌లో తొలి మ్యాచ్ అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది.

అదే సమయంలో అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో టీమిండియా తన ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 15న టోర్నీకే కీలక మ్యాచ్ జరగనుంది.

ఆరోజు టీమిండియా, పాకిస్తాన్ టీంలు తలపడనున్నాయి.

కాగా, సెమీఫైనల్‌కు చేరే నాలుగు జట్లపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భారీ అంచనాలు వేశాడు.

2023 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ లాంచింగ్ ఈవెంట్‌లో సెహ్వాగ్ సెమీఫైనల్‌కు జట్లపై తన అంచనాలు వెల్లడించాడు.

భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయని జోస్యం చెప్పాడు.

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీ-ఫైనల్‌కు కచ్చితంగా చేరుకుంటాయని తెలిపాడు.

ఎందుకంటే ఆ ఆటగాళ్లు నేరుగా బ్యాట్‌తోనే మాట్లాడగలరంటూ చెప్పుకొచ్చాడు.