సౌతాఫ్రికాలో రోహిత్ శర్మ చరిత్ర సృష్టిస్తాడా.. కోహ్లీ, ధోనీలా విఫలమవుతాడా?

25th December 2023

Pic credit - Instagram

భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ దేశంలో టీమ్ ఇండియా ఇప్పటివరకు ఏ టెస్టు సిరీస్‌ను గెలవలేకపోయింది.

కెప్టెన్ రోహిత్ శర్మకు చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. అతని నాయకత్వంలో టీమ్ ఇండియా ఇక్కడ సిరీస్ గెలిస్తే అది పెద్ద అవకాశం. 

ఎందుకంటే, గంగూలీ-కోహ్లీ-ధోనీ లాంటి కెప్టెన్ల నాయకత్వంలో కూడా ఈ అద్భుతం జరగలేదు. వీళ్లంతా సిరీస్ ఓడిపోయారు.

ఇక్కడ రోహిత్ శర్మ రికార్డును పరిశీలిస్తే, అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాలో 4 టెస్టులు ఆడాడు. అందులో అతని పేరుతో 126 పరుగులు మాత్రమే ఉన్నాయి.

దక్షిణాఫ్రికాలో రోహిత్ శర్మ సగటు కేవలం 15 మాత్రమే. అందులో అతని పేరులో ఎటువంటి అర్ధ సెంచరీ లేదు. రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 47.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రోహిత్ కంటే భారత బౌలర్లు ఇక్కడ ఎక్కువ పరుగులు చేశారు. అంటే, భారత బౌలర్లు రోహిత్ కంటే అధికంగా రన్స్ చేశారన్నమాట.

వీరిలో రవిచంద్రన్ అశ్విన్ 6 టెస్టుల్లో 197 పరుగులు చేయగా, అతని సగటు 17. ఈ జాబితాలో జహీర్ ఖాన్, అనిల్ కుంబ్లే వంటి బౌలర్లు కూడా రోహిత్ కంటే ముందున్నారు.

రోహిత్ శర్మ గాయపడినందున గత పర్యటనలో ఇక్కడకు రాలేదు. అంతకు ముందు అతను టెస్టుల్లో ఓపెనింగ్ చేయలేదు. 

అందుకే రోహిత్ శర్మ రికార్డు బాగో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్‌కి ఇప్పుడు తన రికార్డును మెరుగుపరుచుకునే పెద్ద అవకాశం వచ్చిందన్నమాట.