సూపర్ 8కి ముందు షాకింగ్ న్యూస్.. గాయపడిన టీమిండియా స్టార్ ప్లేయర్

TV9 Telugu

17 June 2024

T20 ప్రపంచ కప్ 2024లో భారత జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది. గ్రూప్ దశలో ఘన విజయంతో సూపర్ 8 చేరింది.

రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడగా మూడింటిలో విజయం సాధించగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 

సూపర్ 8లో టీమ్ ఇండియా సులువుగా చోటు దక్కించుకుంది. ఈ మేరకు వెస్టిండీస్‌లో సూపర్ 8 మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమైంది.

ఇప్పుడు సూపర్ 8 దశలో భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది.

ఆ తర్వాత బంగ్లాదేశ్ జట్టుతో సూపర్ 8లో రెండో మ్యాచ్ ఆడనుంది.

ఆ తర్వాత మూడో, చివరి మ్యాచ్ ఆస్ట్రేలియాతో రోహిత్ సేన తలపడనుంది.

అయితే సూపర్ 8 తొలి మ్యాచ్‌కు ముందు, సూర్యకుమార్ యాదవ్ గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

దీంతో జట్టుతోపాటు అభిమానులకు ఒక చేదు వార్త వచ్చింది. తొలి మ్యాచ్ ఆడతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.