ఆసీస్ టూర్‌కి రోహిత్ శర్మ డౌట్.. టీమిండియా కెప్టెన్‌గా ఎవరంటే?

TV9 Telugu

11 October 2024

రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమ్ ఇండియా పటిష్ట ప్రదర్శన కొనసాగుతోంది. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను కూడా భారత్ కైవసం చేసుకుంది.

రోహిత్ కెప్టెన్సీపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రాబోయే కొద్ది వారాల్లో టీమిండియా స్టార్ కెప్టెన్ లేకుండానే మైదానంలోకి దిగాల్సి రావచ్చు.

వ్యక్తిగత కారణాల వల్ల ఆస్ట్రేలియా టూర్‌లోని మొదటి లేదా రెండో టెస్టు మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం కావచ్చని ఒక నివేదిక పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా కెప్టెన్సీ ఎవరికి దక్కుతుంది?

బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఎవరినీ నియమించలేదు. కాబట్టి, ఈ బాధ్యత ఎవరికి దక్కుతుందనే ప్రశ్న మరింత ముఖ్యమైనది.

ఇందుకోసం, టీమిండియాకు 3 ఎంపికలు ఉన్నాయి. వీటిలో మొదటి పేరు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. అతను 2022లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.

రెండవ ఎంపిక శుభమాన్ గిల్. అతను ఇటీవలే వన్డే, టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో, అతను ప్రతి మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమవుతాడు.

మూడవ ఎంపిక కేఎల్ రాహుల్ కావచ్చు. అతని ఎంపిక ప్రశ్నర్థకంగా మారింది. కానీ, అతను ఇప్పటికే 3 టెస్ట్ మ్యాచ్‌లలో భారతదేశానికి నాయకత్వం వహించాడు. అందులో భారత్ బంగ్లాదేశ్‌పై 2 మ్యాచ్‌లు గెలిచింది.

ఆస్ట్రేలియాతో టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇందుకోసం టీమిండియా జట్టును ఇంకా ప్రకటించలేదు. అయితే, రోహిత్ స్థానంలో ఎవరు ఆడతారనేది చూడాలి.