8 ఇన్నింగ్స్ ల్లో 7 సార్లు విఫలం.. జట్టు కష్టాలను పట్టించుకోని రోహిత్

TV9 Telugu

26 October 2024

పూణె టెస్టులో భారత్‌కు 359 పరుగుల విజయ లక్ష్యం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 255 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 

భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. ఇప్పుడు ఈ పోటీ ఉత్కంఠ రేపుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే రోహిత్ శర్మ జట్టు అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.

న్యూజిలాండ్ బ్యాటింగ్ ముగిశాక క్రీజులోకి వచ్చిన టీమిండియా బ్యాట్స్ మెన్ దూకుడుగా ఆడారు. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ 34 బంతుల్లో 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

యశస్వి జైస్వాల్ ఒకవైపు నుంచి నిరంతరం పరుగులు సాధిస్తూనే ఉన్నాడు. మరోవైపు రోహిత్ బ్యాట్ మౌనంగా ఉంది. 

ఆరో ఓవర్ నాలుగో బంతికి అతను ఔటయ్యాడు. అతను కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. విల్ యంగ్ చేతిలో మిచెల్ సాంట్నర్ క్యాచ్ పట్టాడు రోహిత్.

రోహిత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. గత 8 ఇన్నింగ్స్‌ల్లో 7 సార్లు విఫలమయ్యాడు. ఈ సమయంలో అతను కేవలం ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. 

బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ 6, 5 పరుగులు చేశాడు. ఆ తర్వాత, అతను కాన్పూర్‌లో 23, 8 పరుగులు చేసి ఔటయ్యాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 2 పరుగులకే ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులు చేశాడు. రెంటో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో జీరో, రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులు మాత్రమే చేశాడు.