WPLలో గేర్లు మార్చిన డ్రైవర్ కూతురు.. కట్‌చేస్తే.. సరికొత్త చరిత్ర

24 February 2024

TV9 Telugu

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) రెండో సీజన్‌లో శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత బౌలర్లు విధ్వంసం సృష్టించారు. 

బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCBW) లెగ్ స్పిన్నర్ శోభనా ఆశా చరిత్ర సృష్టించింది. 

శోభనా UP వారియర్స్ (UPW)పై 5 వికెట్లు పడగొట్టింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో 5 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా శోభనా ఆశా రికార్డు సృష్టించింది. 

అయితే శోభన ఆశలకు ఈ ప్రయాణం అస్సలు సులువు కాలేదు. తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. చివరకు అనుకున్న మేర పేరు గడించే పనిలో నిమగ్నమైంది.

కేరళలోని తిరువనంతపురంలో నివాసముంటున్న శోభన ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఆమె తండ్రి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 

శోభనా ఆషా ప్రదర్శన గురించి మాట్లాడితే, ఆమె UPWపై 4 ఓవర్లు బౌలింగ్ చేసి 5.50 ఎకానమీ వద్ద 22 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. 

యూపీడబ్ల్యూ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేయడానికి వచ్చిన ఆశా శోభన 3 వికెట్లు పడగొట్టి ఆర్సీబీడబ్ల్యూని మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకొచ్చింది. 

మొదటి WPLలో, 3 బౌలర్లు 5 వికెట్లు పడగొట్టారు. కానీ, వారిలో ఒక్కరు కూడా భారతీయుడు కాదు. మొదటి ఎడిషన్‌లో కిమ్ గార్త్, మారిజ్నే కాప్, తారా నోరిస్ 5 వికెట్లు తీశారు.