TV9 Telugu
18 June 2024
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళా జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో సిరీస్ను కైవసం చేసుకుంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మరో సెంచరీతో మెరిసింది.
స్మృతి మంధాన సెంచరీ తర్వాత, ఆమె ప్రియుడు పలాష్ ముచ్చల్ ఆమెపై ప్రేమను కురిపించాడు.
పలాష్ ముచ్చల్ మంధాన రెండు ఫోటోలను పంచుకున్నాడు. ఆమెను అన్స్టాపబుల్గా అభివర్ణించాడు.
స్మృతి మంధాన దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు వన్డే సెంచరీలు చేసి చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది.
మంధాన తన వన్డే కెరీర్లో 7వ సెంచరీని నమోదు చేసి, ఇప్పుడు భారత్ తరపున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఓపెనర్గా నిలిచింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలోనూ స్మృతి మంధాన ఒక వికెట్ తీసింది. ఆమె లూస్ వికెట్ పడగొట్టింది.
అంతర్జాతీయ క్రికెట్లో మంధాన మొదటిసారిగా బౌలింగ్ చేసింది. ఆమె యాక్షన్ సరిగ్గా విరాట్ కోహ్లీలా ఉంది.