అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన ధోనీ.. అదేంటంటే?

26th November 2023

Pic credit - Instagram

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన అభిమానులకు మైదానంలో లేదా మైదానం వెలుపల సంతోషంగా ఉంచేలా చేస్తుంటాడు.

ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ధోనీని మైదానంలో చూసే అవకాశం అభిమానులకు ఉంది. కాబట్టి, ఇది అతని చివరి సీజన్ అవుతుందనే భయం ఎప్పుడూ ఉంటుంది.

IPL 2023 సీజన్‌లో కూడా అభిమానులకు అదే భయం ఉంది. అందుకే, చెన్నై మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా, ధోనిని చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

ఇప్పుడు ధోనీ కూడా తన అభిమానులకు ఆనందంగా ఉండే అవకాశం ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కూడా తదుపరి సీజన్‌కు తిరిగి వస్తున్నాడు.

ఆదివారం, నవంబర్ 26, IPL 2024 ట్రేడింగ్ రోజున, CSK తన వెటరన్ కెప్టెన్‌ని కొనసాగించింది. ధోని తదుపరి సీజన్‌లో కూడా ఆడేలా చూసుకుంది.

గత సీజన్‌లో ధోనీ సారథ్యంలో చెన్నై ఐదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. వచ్చే సీజన్‌లో తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తానని ధోనీ చెప్పాడు. ఇప్పుడు అభిమానులు మార్చి వరకు ఆగాల్సిందే.

అయితే, ధోని సీజన్ మొత్తం మోకాలి గాయంతో పోరాడుతూనే ఉన్నందున అభిమానుల మనస్సులలో భయం నెలకొంది. ధోనీని మైదానంలో చేసే వరకు వేచి చూడాల్సిందే. 

ఐపీఎల్ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కానీ, ఇటీవలి వీడియోలో అతను నొప్పితో బాధపడుతున్నట్లు కనిపించాడు.