అజారుద్దీన్‌తో ఎఫైర్ ఉన్నట్లు పుకార్లు వచ్చిన మహిళా ప్లేయర్‌తో సిరాజ్

TV9 Telugu

07 February  2024

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో మహ్మద్ సిరాజ్ ఆడలేదు. అయితే, 3వ టెస్టులో రీఎంట్రీ చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, ఈ వార్తల మధ్య తాజాగా ఈ భారత పేసర్ సిరాజ్ ఫొటో ఒకటి వైరలవుతోంది. అందులో ఓ మహిళా క్రిడాకారిణితో కనిపించాడు. 

మహ్మద్ సిరాజ్ ఈ ఫొటోలో భారతదేశపు దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తాతో కనిపించాడు. దీంతో నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.

జ్వాలా గుత్తా పేరు ఒకప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌తో ముడిపడి ఉంది. వీరిద్దరి మధ్య అనుబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే, అజార్ తర్వాత ఈ వార్తలను ఖండించారు. ఇద్దరూ మంచి స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అప్పట్లో ఆ వార్తలకు చెక్ పెట్టేశాడు.

ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్టులో సిరాజ్ రీఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

సిరాజ్ తన స్వంత మైదానం ఉప్పల్‌లో ఆకట్టుకోలేకపోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో మొత్తం 11 ఓవర్లు బౌలింగ్ చేశాడు.

దీంతో విశాఖ టెస్టు నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ముఖేష్ కుమార్‌ను ఆడించారు. ఆయన కూడా విశాఖలో ఆకట్టుకోలేకపోయాడు.