వేలంలో కొనేందుకు కెప్టెన్ ఇష్టపడలేదు.. కట్‌చేస్తే.. బీభత్సమైన ఇన్నింగ్స్

TV9 Telugu

31 August 2024

కర్ణాటక టీ20 లీగ్ మహారాజా ట్రోఫీ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుత సీజన్ ముగియడానికి ఇప్పుడు కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి.

చివరి దశలో మహారాజా ట్రోఫీ

మహారాజా ట్రోఫీలో మొదటి సెమీ-ఫైనల్ ఆగస్టు 29న బెంగళూరు బ్లాస్టర్స్ వర్సెస్ గుల్బర్గా మిస్టిక్స్ మధ్య జరిగింది.

మహారాజా ట్రోఫీ సెమీ ఫైనల్స్

ఈ మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు 9 వికెట్ల తేడాతో గుల్బర్గ్ మిస్టిక్స్‌పై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. 

ఫైనల్లో బెంగళూరు బ్లాస్టర్స్

తొలి సెమీఫైనల్‌లో బెంగళూరు బ్లాస్టర్స్‌ ఓపెనర్‌ ఎల్‌ఆర్‌ చేతన్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో ప్రకంపనలు సృష్టించాడు. అతను 174 స్ట్రైక్ రేట్‌తో 51 బంతుల్లో 89 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా చేశాడు.

LR చేతన్ బీభత్సం 

బెంగళూరు బ్లాస్టర్స్‌ జట్టు 156 పరుగులను సులభంగా ఛేదించి ఫైనల్‌కు చేరిన ఎల్‌ఆర్ చేతన్‌ను జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదంట.

కెప్టెన్ కొనడానికి ఇష్టపడలేదు

చేతన్ వేలంలో రూ. 8.6 లక్షలకు అమ్ముడయ్యాయి. అతను మహారాజా ట్రోఫీ 2024లో అత్యంత ఖరీదైన ఆటగాడు. అందుకే చేతన్‌ను కొనేందుకు మయాంక్ ఇష్టపడలేదు.

చేతన్ అత్యంత ఖరీదైన ఆటగాడు

ఎల్ఆర్ చేతన్ టోర్నమెంట్ అంతటా తన ప్రదర్శనతో తన ధరను సమర్థించుకున్నాడు. లీగ్‌లో జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. 

అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు

టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. అతను 11 మ్యాచ్‌ల్లో 150 స్ట్రైక్ రేట్‌తో 378 పరుగులు చేశాడు. 

సత్తా చాటిన చేతన్