IPL నుంచి అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాడు ఎవరో తెలుసా?

TV9 Telugu

07 September 2024

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోనీలు ఐపీఎల్ నుంచి అత్యధికంగా ఆర్జించిన వారి జాబితాలో టాప్-3లో ఉన్నారు.

రోహిత్ శర్మ డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ 17 సీజన్లు ఆడాడు. ఈ కాలంలో ఆయన అత్యధికంగా రూ.194.6 కోట్లు ఆర్జించారు.

రూ. 188.8 కోట్లతో రోహిత్ శర్మ తర్వాత ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు. ధోని ప్రస్తుతం చెన్నై తరపున ఆడుతున్నాడు.

విరాట్ కోహ్లీ కూడా ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున మాత్రమే ఆడాడు. మొత్తం 188.2 కోట్లు ఆర్జించాడు. 

రవీంద్ర జడేజా నాలుగో స్థానంలో, సునీల్ నరైన్ ఐదో స్థానంలో, సురేశ్ రైనా ఆరో స్థానంలో ఉన్నారు. ఈ ముగ్గురూ వరుసగా రూ.125.01 కోట్లు, రూ.113.24 కోట్లు, రూ.110.74 కోట్లు ఆర్జించారు.

ఐపీఎల్ నుంచి రూ.102 కోట్లతో డివిలియర్స్ 7వ స్థానంలో ఉండగా, శిఖర్ ధావన్ రూ.100.05 కోట్లతో 8వ స్థానంలో ఉన్నాడు.

కేఎల్ రాహుల్ రూ. 99.1 కోట్ల సంపాదనతో 9వ స్థానంలో, గ్లెన్ మాక్స్‌వెల్ రూ.96.42 కోట్లతో 10వ స్థానంలో ఉన్నారు.

గంభీర్ IPL నుంచి 94.62 కోట్లు సంపాదించి జాబితాలో 11వ స్థానంలో నిలిచాడు. దినేష్ కార్తీక్ 92.42 కోట్ల ఆదాయంతో 12వ స్థానంలో ఉన్నాడు.