దులీప్ ట్రోఫీ నుంచి ఇషాన్ ఔట్.. ఎంట్రీ ఇచ్చిన అన్‌లక్కీ ప్లేయర్

TV9 Telugu

4 September 2024

సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్‌కు ఇషాన్ కిషన్ అందుబాటులో ఉండడని సమాచారం. 

సెప్టెంబర్ 5 నుంచి

ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీలో జార్ఖండ్ తరపున ఆడుతున్న కిషన్ దులీప్ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.

బుచ్చిబాబు టోర్నీలో బిజీ

ఇషాన్ కిషన్ స్థానంలో సంజు శాంసన్‌ని ఎంపిక చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇషాన్ బదులు తొలి మ్యాచ్ శాంసన్ ఆడనున్నాడు.

ఇషాన్ కిషన్ స్థానంలో

ఈసారి దులీప్ ట్రోఫీ టోర్నీకి ఎంపికైన 4 జట్లలో ఇషాన్ కిషన్ డి టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. కానీ, తొలి మ్యాచ్ ఆడే అవకాశం లేదు.

టీమ్‌లో చోటు

శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని ఈ జట్టులో ఇషాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయ్యాడు. 

శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో

గాయం కారణంగా సెప్టెంబరు 5న ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌కు అతను అందుబాటులో లేని అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అందుబాటులో లేడు

దులీప్ ట్రోఫీ టోర్నీకి ఎంపికకాని కేరళ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ కి చోటు దక్కే అవకాశం ఉంది. 

సంజూ శాంసన్ కి చోటు

దీని ప్రకారం సెప్టెంబరు 5 నుంచి అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియంలో సి, టీమ్ డి మధ్య జరిగే మ్యాచ్‌లో సంజూ శాంసన్ కనిపించవచ్చు.

సెప్టెంబరు 5 నుంచి