IPL 2024లో ధోనీకి కీలక సమస్య.. ఆందోళనలో చెన్నై టీం..

TV9 Telugu

09 February 2024

క్రికెట్ ప్రేమికులంతా మార్చి 22 కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు నుంచి IPL 2024 సీజన్ ప్రారంభమవుతుంది. 

ఐపీఎల్ 2024లో మొదటి మ్యాచ్‌లో ఎంఎస్ ధోని తన జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ బరిలోకి దిగనుంది. ఢిపెండింగ్ ఛాంపియన్‌గా కనిపించనుంది.

ఇందుకోసం ధోనీ ఇప్పటికే ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. ఇటీవల అతను నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు.

ఈ క్రమంలో చెన్నై జట్టు స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో కెప్టెన్ ధోనీకి, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నాడు.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ధోనీ ఏ సమస్యను ఎదుర్కోగలడు? రెండో ప్రశ్న ఏంటంటే.. సమస్య వచ్చినా చాహర్ బహిరంగంగా ఎందుకు చెబుతున్నాడు?

ధోనీ, CSK అభిమానులు కలత చెందకముందే అసలు నిజం తెలుసుకుందాం. చాహర్ మాట్లాడుతున్న సమస్య ధోని ఫిట్‌నెస్ గురించి లేదా జట్టు ప్రదర్శన గురించి కాదు.

నిజానికి, ఈ సీజన్‌లో జట్టు కలయికపై ధోనీ-ఫ్లెమింగ్ ఆందోళన చెందవచ్చని చాహర్ అభిప్రాయపడ్డాడు. దీనికి కారణం కూడా చాహర్ తెలిపాడు.

డిసెంబరులో జరిగిన వేలం చెన్నై సూపర్ కింగ్స్‌కు చాలా మంచిదని రుజువైంది. ఇటువంటి పరిస్థితిలో, జట్టులో చాలా ఎంపికలు వచ్చి చేరాయి. 

ఈ క్రమంలో ధోనితోపాటు కోచ్ కు సరైన కలయికను ఎంచుకోవడం అంత సులభం కాదంటూ రైట్ ఆర్మ్ ఇండియన్ పేసర్ చాహర్ అభిప్రాయపడ్డాడు.