21 ఏళ్లుగా కరేబియన్లపై భారత్‌దే పైచేయి.. అసలు ట్విస్ట్ ఏమిటంటే..?

భారత్‌-వెస్టిండీస్‌ మధ్య టెస్టు సిరీస్‌ ప్రారంభానికి ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది.

డొమినికా వేదికగా జూలై 12 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.

అయితే 2 దశాబ్దాలుగా వెస్టిండీస్‌పై భారత్‌దే పైచేయి.

21 ఏళ్లుగా వెస్టిండీస్‌తో భారత్ ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా కోల్పోలేదు.

2002 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య మొత్తం 8 టెస్ట్ సిరీస్‌లు జరిగాయి.

ఈ 8 టెస్టు సిరీస్‌లన్నింటిలోనూ భారత జట్టే గెలిచింది.

ఇక ఈ 2 టెస్టుల సిరీస్‌ని కూడా గెలిస్తే భారత్ తన విజయ పరంపరను కొనసాగిస్తుంది.

ఒక వేళ టెస్టు సిరీస్ గెలిస్తే వెస్టిండీస్ చారిత్రక రికార్డు సృష్టినట్లే అవుతుంది.

ఇదిలా ఉండగా 1948 నుంచి 2002 వరకు మొత్తం 16 సిరీస్‌లు జరగాయి.

అందులో 2 టీమిండియా గెలవగా, 2 డ్రా అయ్యాయి. మిగిలినవాటిలో కరేబియన్లదే విజయం.