చెన్నై టెస్టులో ఎవరూ ఊహించని భారీ రికార్డ్..

TV9 Telugu

21 September 2024

చెన్నై టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసింది. ప్రస్తుతం టీమిండియా విజయానికి కేవలం 6 వికెట్ల దూరంలో ఉంది. ఇక విజయమంతా టీమిండియా బౌలర్లపైనే నిలిచింది.

అదే సమయంలో ఓటమి నుంచి తప్పించుకోవాలంటే బంగ్లాదేశ్ మరో 357 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్ల ముందు ఈ టార్గెట్ రీచ్ కావడం కష్టమే.

మూడో రోజు ఆట కూడా టీమ్ ఇండియా పేరులోనే ఉంది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను నాలుగు వికెట్లకు 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ సమయంలో రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ సెంచరీలు చేశారు.

ఈ ఇన్నింగ్స్‌లో పంత్ 109 పరుగులు చేయగా, శుభ్‌మన్ గిల్ 119 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆర్‌ అశ్విన్‌ బ్యాట్‌ నుంచి కూడా సెంచరీ కనిపించింది.

చెపాక్ టెస్టులో టీమిండియాకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు సెంచరీ చేయడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఘనత గతంలో ఎప్పుడూ చేయలేదు.

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా 515 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 158 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన రవిచంద్రన్ అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో బంతితో అద్భుతాలు చూపించాడు. ఇప్పటి వరకు 3 వికెట్లు తీశాడు. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్‌ను కాపాడుకోవడం చాలా కష్టం.

అంతకుముందు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 149 పరుగులకే కుప్పకూలింది.