18 November 2023

 కోహ్లీ, అశ్విన్‌ ముంగిట  అరుదైన రికార్డు! సచిన్‌, ధోనిలకు సాధ్యం కాలేదుగా

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ (భారత్ వర్సెస్‌ ఆస్ట్రేలియా) మ్యాచ్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది

ఆదివారం (నవంబర్‌ 19) నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది

కాగా ఈమ్యాచ్‌తో టీమిండియా గెలిస్తే విరాట్ కోహ్లీ, స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ ఒక అరుదైన ఘనతను అందుకుంటారు

2011లో టీమిండియా ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో కోహ్లీ, అశ్విన్‌ ఉన్నారు. అంటే వీరి ఖాతాలో ఖాతాలో ఆల్రెడీ ఒక వరల్డ్‌ కప్‌ ఉంది

ఇప్పుడు గెలిస్తే ప్రపంచకప్ ను రెండు సార్లు సొంతం చేసుకున్న జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్లుగా కోహ్లీ, అశ్విన్ లు నిలుస్తారు

సచిన్‌, కపిల్, ధోని లాంటి క్రికెట్‌ దిగ్గజాలకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. మరీ కోహ్లీ, అశ్విన్‌ అందుకోవాలని కోరుకుందాం