గుజరాత్ వద్దంది.. కట్‌చేస్తే.. 41 బంతుల్లో సెంచరీతో దిమ్మతిరిగే షాక్

27th November 2023

Pic credit - Instagram

ఐపీఎల్ తదుపరి సీజన్ కోసం అన్ని జట్లు రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను ఆదివారం విడుదల చేశాయి. ఈ విషయంలో గుజరాత్ టైటాన్స్ తప్పు చేసినట్టు కనిపిస్తోంది.

వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఉర్విల్ పటేల్‌ను గుజరాత్ రిటైన్ చేయలేదు. మరుసటి రోజు, అంటే సోమవారం, ఉర్విల్ ఫ్రాంచైజీ విచారం కలిగించే పని చేశాడు.

ఒక్క రోజు తర్వాత, విజయ్ హజారే ట్రోఫీలో ఉర్విల్ 41 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ టోర్నీలో అతను గుజరాత్ తరపున ఆడుతున్నాడు. ఆంద్రప్రదేశ్‌పై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.

చండీగఢ్‌లోని మహాజన్ క్రికెట్ అకాడమీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ 41 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయంగా 100 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 243.90.

చండీగఢ్‌లోని మహాజన్ క్రికెట్ అకాడమీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ 41 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయంగా 100 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 243.90.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ జట్టు 35.1 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ఉర్విల్ సెంచరీ ఆధారంగా గుజరాత్ 13 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

లిస్ట్-ఏలో భారతీయులెవరికైనా ఇది రెండో వేగవంతమైన సెంచరీ. బరోడా తరపున ఆడుతూ 40 బంతుల్లో సెంచరీ చేసిన యూసుఫ్ పఠాన్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్-2023 వేలంలో ఉర్విల్‌ను టైటాన్స్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఉర్విల్ మరోసారి వేలంలో తన పేరును పంపాడు.