బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్.. 3రెట్లు పెరిగిన జీతం

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అజిత్ అగార్కర్‌ను టీమ్ ఇండియా కొత్త చీఫ్ సెలెక్టర్‌గా ఎంపిక చేసింది.

అగార్కర్ భారతదేశం తరపున చాలా కాలం పాటు ఆడాడు.

దీంతో భారత క్రికెట్‌కు గొప్పగా ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. చాలా కాలంగా చీఫ్ సెలక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది.

దీనికి అసలు కారణం చీఫ్ సెలక్టర్ జీతమే కారణమని తెలిసింది.

అయితే ఇప్పుడు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ వేతనాన్ని మూడు రెట్లు పెంచారు.

ఇంతకుముందు చీఫ్ సెలెక్టర్ ఏడాదికి కోటి రూపాయల వేతనం పొందేవారు.

ఇప్పుడు దానిని మూడు రెట్లు పెంచారు.

ఇకపై చీఫ్ సెలెక్టర్‌కు ఏటా రూ. 3 కోట్ల జీతం లభిస్తుంది.