ఐసీసీ కంటే 6 రెట్లు.. టీమిండియాకు బీసీసీఐ బంఫర్ ఆఫర్..

TV9 Telugu

01 July 2024

టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా ట్రోఫీ కోసం 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు టీమిండియా తెరపడింది.

ఛాంపియన్‌గా టీం ఇండియా

రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి రెండోసారి ఈ ట్రోఫీని గెలుచుకుంది. 

రెండోసారి ప్రపంచకప్‌

టీమ్ ఇండియా సాధించిన ఈ చిరస్మరణీయ విజయం యావత్ దేశం ఆనందంలో నిండగా, ఆటగాళ్ల ఖాతాల్లోనూ రివార్డుల వర్షం కురిసింది.

జట్టుపై రివార్డుల వర్షం

ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, టీమ్ ఇండియా ఐసీసీ నుంచి ట్రోఫీ, పతకంతోపాటు దాదాపు రూ. 22.76 కోట్లను రివార్డ్‌గా అందుకుంది.

ఐసీసీ ప్రైజ్ మనీ కంటే 6 రెట్లు

అదే సమయంలో, టీమిండియా సాధించిన ఈ చిరస్మరణీయ విజయంపై ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ తన ఖజానాను పూర్తిగా తెరిచింది.

బీసీసీఐ బిగ్ సర్‌ప్రైజ్

విజయం సాధించిన ఒక రోజు తర్వాత, టీమ్ ఇండియా, దాని సహాయక సిబ్బందికి 125 కోట్ల రూపాయల రివార్డు ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా ప్రకటించారు.

రూ.125 కోట్ల పారితోషికం

ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినందుకు క్రికెట్ చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఏ బోర్డు కూడా తమ జట్టుకు ఇంత పెద్ద పారితోషికం ఇవ్వలేదు.

అతిపెద్ద బహుమతి

అయితే, ఛాంపియన్ టీం స్వదేశానికి తిరిగి రావడంలో జాప్యం ఏర్పడింది. బార్బోడాస్‌లో తుఫాన్ కారణంగా, విమానాశ్రయం మూసేశారు.

స్వదేశానికి రావడంలో ఇబ్బంది