విరాట్ కోహ్లీ, అనుష్కల ఏడడుగుల బంధానికి ఆరేళ్లు..

11 December 2023

క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ 2017 డిసెంబర్ 11 న వివాహం చేసుకున్నారు. వీరి దాంపత్య జీవితానికి ఆరేళ్లు పూర్తి.

 విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ  మొదటిసారిగా 2013లో ఓ షాంపూ యాడ్‌లో  కలుసుకున్నారు.  అప్పటి నుంచి మంచి స్నేహితులుగా  మారారు

ఇద్దరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది.  కోహ్లీ ఏ దేశంలో మ్యాచ్‌లు ఆడినా... అనుష్క కూడా అక్కడికి వెళ్ళేది. మూడేళ్ళ తర్వాత  ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి  చేసుకునే సమయానికి  కోహ్లీ కెప్టెన్ గా ఉన్నాడు. అనుష్క  కెరీర్ లో మంచి స్థాయిలో ఉంది.  పెళ్లి  అనేది  పూర్తిగా తమ వ్యక్తిగత విషయం అని  భావించి కుటుంబ సభ్యుల  సమక్షంలో  వివాహం చేసుకున్నారు.

విరాట్ కోహ్లీ,  అనుష్క శర్మ  ప్రేమకు ప్రతిరూపంగా 2021 జనవరి 11న వీరికి  కూతురు జన్మించింది.

అనుష్క తనను మంచి వ్యక్తిగా మార్చిందని.. తను భాగస్వామి  అవ్వడం వల్ల ఒత్తిడిని ఎదర్కోగలిగానని.. విరాట్ చాలా సార్లు చెప్పుకొచ్చారు.

 విరాట్ ఒక పోరాట యోధుడనీ.. దేశాన్ని గెలిపించాలనే అంకితభావంతో తన భర్త ఉంటారని.. కోహ్లీ దొరకడం అదృష్టమని అనుష్క చెబుతుంది.

ఇటీవలే వరల్డ్ కప్‌లో  సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల (49) రికార్డ్ ను బ్రేక్ చేసి.. వన్డేల చరిత్రలో 50 సెంచరీలు సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు.