బంగ్లాతో టీ20 సిరీస్‌.. అరంగేట్రం చేయనున్న ముగ్గురు ఫ్యూచర్ స్టార్స్

TV9 Telugu

2nd October 2024

భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుంది.

అక్టోబర్ 6 నుంచి టీ20 సిరీస్

మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం భారత జట్టును ప్రకటించింది.

టీ20 సిరీస్‌ కోసం భారత జట్టు

సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వగా, రాబోయే సిరీస్‌లకు ఎంపిక చేసిన జట్టులో యువకులకు అవకాశం కల్పించారు.

యువకులకు అవకాశం 

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి కూడా అందుబాటులో ఉన్నారు.

ముగ్గురికి ఛాన్స్

ఈ ముగ్గురూ ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించారు. ఇప్పుడు జాతీయ జట్టులో అవకాశం వచ్చింది.

ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన

ఇందులో భాగంగా అక్టోబర్ 6 నుంచి మూడు టీ20ల సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ గ్వాలియర్‌లో జరగనుంది.

తొలి మ్యాచ్ గ్వాలియర్‌లో

రెండో టీ20 మ్యాచ్ అక్టోబర్ 9న ఢిల్లీలో జరగనుంది. మూడో టీ20 మ్యాచ్ అక్టోబర్ 12న, హైదరాబాద్‌లో జరగనుంది.

హైదరాబాద్‌లో మూడో టీ20

ఇప్పటికే రెండు టెస్టుల్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టీ20 సిరీస్‌ను దక్కించుకోవాలని చూస్తోంది.

క్లీన్ స్వీప్ కోసం