అల్లరి నరేశ్‌ హీరోగా నటించిన కితకితలు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది గీతాసింగ్‌.

ఇందులో తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించడమే కాదు సెంటిమెంట్‌తో కన్నీళ్లు తెప్పించింది గీతాసింగ్‌.

అయితే ఏమైందో తెలియదు గానీ ఉన్నట్లుండి ఆమె సినిమాలకు దూరమైపోయింది.

అయితే గతేడాది జరిగిన మా ఎలక్షన్స్‌లో మంచు విష్ణు ప్యానెల్‌ తరపున పోటీ చేసి గెలుపొందింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సినిమాలకు దూరంగా ఉండడానికి గల కారణాలను బయటపెట్టింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.

‘ఇండస్ట్రీలో నాకు అవకాశాలు రావడం లేదు. అందుకే నటించడం లేదు. పరిశ్రమలో అసలు సపోర్ట్‌ లేదు. ఇండస్ట్రీలో పురుషాధిక్యం ఎక్కువ. అన్నారు.

సినిమాల్లో నటించి ఎంతో కష్టపడి సంపాందిచుకున్న డబ్బును ఓ మనిషిని నమ్మి పోగొట్టుకున్నాను. ఒకరి దగ్గర చిట్టీలు వేసి దారుణంగా మోసపోయాను. సుమారు రూ. 6 కోట్ల వరకు నష్టపోయాను’అన్నారు.