ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శీతాకాలంలో దీని వినియోగం చాలా ఆరోగ్యకరమైనది

అందుకే వైద్య నిపుణులు చలికాలంలో మాత్రమే ఖర్జూరాన్ని తినమని సలహా ఇస్తారు

అయితే కొంతమందికి ఇష్టముంటుంది మరికొంతమందికి నచ్చదు

ఇలాంటి సమయంలో ఇందులో ఉండే పోషకాలు లభించాలంటే ఖర్జూరతో చేసిన వంటకాలు తింటే సరిపోతుంది

ఖర్జూరం చట్నీ కావలసిన పదార్థాలు.. ఖర్జూరం – 100 గ్రాములు, ఎర్ర కారం – 1/2 tsp, జీలకర్ర పొడి – 1/2 tsp, బ్లాక్ సాల్ట్ – 1/2 tsp, డ్రై ఫ్రూట్స్ – 2 tsp, ఉప్పు – రుచి ప్రకారం

దీన్ని చేయడానికి ముందుగా ఖర్జూరం నుంచి గింజలను తీసివేసి మూడు కప్పుల నీటిలో సుమారు 2 గంటల పాటు నానబెట్టాలి

తరువాత ఖర్జూరాలను నీటిలో నుంచి తీసి వాటిని ఒక పాత్రలో ఉంచి బాగా ఉడికించాలి. ఖర్జూరాలు ఉడికిన తర్వాత మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయాలి

తర్వాత కారం, ఎండుమిర్చి, జీలకర్ర పొడి వంటివి వేసి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్, వైట్ సాల్ట్ వేసి కలపాలి