కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కలిసిన చిరంజీవి, రామ్‌ చరణ్‌

భారతదేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను తెలుగు చిత్ర పరిశ్రమ గణనీయంగా ప్రభావితం చేసిందని కొనియాడారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

నాటు నాటు పాటకు ఆస్కార్‌ వచ్చిన సందర్భంగా ప్రముఖ నటులు చిరంజీవి, రామ్‌చరణ్‌ శుక్రవారం రాత్రి కేంద్ర హోంమంత్రిని ఆయన నివాసంలో కలిశారు

ఈ తరుణంలో రామ్‌చరణ్‌ను శాలువాతో సత్కరించారు అమిత్‌షా

నాటు నాటు పాటకు ఆస్కార్‌  రావడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ విజయం సాధించడంపై కేంద్రమంత్రి రామ్‌చరణ్‌ను అభినందించారు

టాలీవుడ్ కు చెందిన ఇద్దరు స్టార్స్ (చిరంజీవి, రామ్‌ చరణ్‌) కలవడం ఆనందంగా ఉందని తెలిపారు అమిత్‌షా

ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్వయంగా ట్వీట్‌ చేశారు

రామ్‌ చరణ్‌కు అభినందనలు తెలిపి ఆశీస్సులు ఇచ్చినందుకు కేంద్ర హోంమంత్రికి ఆర్‌ఆర్‌ఆర్‌ టీం, రామ్‌చరణ్‌ తరఫున కృతజ్ఞతలు అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు