గ్లాస్గో నగరానికి చెందిన చెఫ్, చికెన్ టిక్కా మసాలాను కనిపెట్టిన ఘనత పొందిన అలీ అహ్మద్ అస్లాం కన్నుమూశారు.

సీనియర్ చెఫ్ అయిన ఈయన వయసు 77 సంవత్సరాలు.

అలీ అహ్మద్ అస్లాం మరణాన్ని గ్లాస్గోలోని అతని శిష్ మహల్ రెస్టారెంట్ ప్రకటించింది.

ఆయనకు గౌరవ సూచకంగా 48 గంటలపాటు రెస్టారెంట్ ను మూసివేశారు.

ఇతను 1970వ సంవత్సరంలో తన రెస్టారెంట్ శిష్ మహల్‌లో టొమాటో సూప్ టిన్‌తో చేసిన సాస్‌ను మెరుగుపర్చడం ద్వారా చికెన్ టిక్కా మసాలా వంటకాన్ని కనుగొన్నారు.

ఈ వంటకం బ్రిటిష్ రెస్టారెంట్లలో అత్యంత ప్రజాదరణ పొందింది.

చికెన్ టిక్కా మసాలా కస్టమర్ అభిరుచికి అనుగుణంగా తయారుచేస్తామని అలీ తెలిపారు.