కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ లోకాన్ని విడిచి అప్పుడే ఒక ఏడాది గడిచిపోయింది. పునీత్ రాజ్ కుమార్ మరణం ను ఇప్పటికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

గతేడాది అక్టోబర్‌29న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అయితే అతని జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉన్నాయి.

పునీత్ మరణించి ఏడాది కావడంతో ఈ రోజు పునీత్ ను తలుచుకొని పలువురు సినిమా ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

‘వుయ్ మిస్ యూ అప్పు ’ అంటూ పునీత్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

అప్పూ లీవిస్ ఆన్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.. ఇక పునీత్ నటించిన చివరి చిత్రం ‘గంధడ గుడి’ నిన్న (అక్టోబర్ 28న) విడుదలైంది. ఈ సినిమాను కన్నడ ప్రభుత్వం భారీ స్థాయిలో రిలీజ్ చేసింది.

పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం ‘కర్ణాటక రత్న’ పురస్కారం అందజేయనున్నట్లు  ప్రకటించిన సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ రజినీ కాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పునీత్ కు తెలుగునాట ఆయనకు అశేష అభిమానగణం ఉంది.