పండగకు ముందు పెరగనున్న వంటనూనెల ధరలు..కారణం ఇదేనా?

28 August 2024

Subhash

త్వరలోనే పండగల సీజన్‌ మొదలుకానుంది. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

సీజన్‌ 

ఎడిబుల్‌ ఆయిల్స్‌ దిగుమతిపై సుంకం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా వంటనూనెల ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి.

సుంకం

మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యాపారుల ఒత్తిడి నేపథ్యంలో ఈ కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇంతకు ముందు ఈ వ్యాపారుల ఒత్తిడితో శనగలపై స్టాక్‌ పరిమితి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

వ్యాపారులు

ఎడిబుల్‌ ఆయిల్స్‌పై దిగుమతి సంకాన్ని పెంచాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సూచించింది. దేశీయ నూనె గింజల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే దీనికి కారణమని మంత్రిత్వశాఖ పేర్కొంది.

ఆయిల్స్‌

సోయాబీన్ ప్రాసెసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SOPA) చైర్మన్ డేవిశ్‌ ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో ఆయన సమావేశమయ్యారు.

సోయాబీన్

దిగుమతి చేసుకునే నూనెలపై సుంకాన్ని పెంచాలని సోపా చాలాకాలంగా డిమాండ్ చేస్తుంది. దీంతో రైతులు తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (MSP) పొందేందుకు వీలు ఉంటుంది. 

దిగుమతి

దేశీయ ఆయిల్‌ పరిశ్రమ నుంచి ఒత్తిడి సైతం తొలగిపోతుందని సోపా పేర్కొంటుంది. ముడి పామాయిల్, సోయాబీన్ ఆయిల్, ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 5.5 శాతం దిగుమతి సుంకం వర్తిస్తుంది. 

ఆయిల్‌

ఇందులో సెస్‌ సైతం ఉంటుంది. అదేవిధంగా రిఫైన్డ్ ఎడిబుల్ ఆయిల్‌పై 13.75 శాతం కస్టమ్స్ డ్యూటీ వర్తిస్తుంది. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్‌లో సోయాబీన్ ధర పడిపోవడంతో సోయాబీన్ రైతులు ఆగ్రహం.

సెస్‌